Tricks and Tips

Thursday, November 7, 2013

అహం ఆవిరైతే ........



నా వయసు 20 ఏళ్ళు . నాకు టీచింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం .
 అందుకే నేను D.Ed చదివాను . నాకు ఈ మధ్య గవర్నమెంట్ 
స్కూల్లో టీచర్ పోస్ట్ వచ్చింది . నా ఆనందానికి అలవి లేదు .
 అలానే మా చుట్టుప్రక్కలగానీ ,బంధువుల్లో గానీ ,గవర్నమెంట్
 ఉద్యోగస్తులు ఎవరూ లేనందున నా అహంకారానికి అంతే 
లేకుండా     పోయింది . పెద్దవాళ్ళు ,స్నేహితులు ఎంత మంది
 ఎన్ని విధాల చెప్పినా నా అహంకారం అణువంతైనా తగ్గలేదు . 

ఇలా ఐదేళ్ళు గడిచాయి . నాలో కష్టపడి పనిచేసే లక్షణం
 అణువంతైనా తగ్గలేదు సరికదా పెరిగింది . అలానే అహంకారం
 కూడా మరింత పెరిగింది . అమ్మ,నాన్న చెప్పిన సూక్తులు
 చెవికెక్కలేదు . నేనేమైనా తప్పు చేశానా ...... అంటూ...... 
 నే చేసే వితండవాదాన్ని వినలేక ,చెప్పటం మానేశారు . 
ఇలా అనే కన్నా నా మూర్ఖత్వానికి నన్ను వదిలేశారంటే 
బాగుంటుందేమో . 

మా స్కూలికి ఒక కొత్త H.M వచ్చారు . ఆయన వయస్సు
 యాభై ఏళ్ళు . P.hd చేశారు . చాలా సౌమ్యంగా ఉన్నారు . 
విసుగు ,విరామం లేకుండా బాగా పనిచేస్తారు . ఆయనకు P.hd
 ఈ మధ్య వచ్చింది కాదని ,ఇరవైరెండేళ్ళ క్రితమే వచ్చిందని
 తెలిసి ఆశ్చర్యపోయాను . ఖాళీ సమయంలో అడిగితే చిరునవ్వు
 నవ్వి ఊరుకున్నారు . అబ్బ !అదే నే P.hd చేస్తేనా ..... 
నాలో అహం ఆలోచించింది ...... 

కొన్నాళ్ళు గడిచింది . నేనొకరోజు తీవ్ర అస్వస్టతకు
 గురయ్యాను .ఎంతలా అంటే డాక్టర్ దగ్గరకు వెళ్లక
తప్పనంత . అమ్మ నన్నుహాస్పిటలుకు తీసుకెళ్లింది .
 డాక్టరమ్మ గారికి 65 ఏళ్ళు ఉంటాయి . అచ్చం
 అమ్మలానే సాధారణ గృహిణిలా ఉంది. ఆమె
 చిరునవ్వుతో కావలసిన ప్రశ్నలు వేసి మందులు
 రాసిచ్చి జాగ్రత్తలు చెప్పింది . ఆటోలో ఇంటికి
 వస్తూ ఆలోచించాను . నా కంటే 40ఏళ్ళు ముందు
  పుట్టి ఆ కాలంలోనే డాక్టర్ చదివి అంత  జ్ఞానం కలిగిన
 ఆమె ఎంత సీదాసాదాగా ఉంది . అదే నే డాక్టర్
 చదివితేనా ....నాలో అహం ఆలోచించింది ....... 

ఈ మధ్య టి.వి. లో జేసుదాసుకు జీవితసాఫల్య
 అవార్డును అందించే కార్యక్రమం చూసాను . 
అనేక భాషలలోయాభై వేలకు పైగామధురమైన 
పాటలు పాడిన వ్యక్తి ఎంత సీదాసాదాగా 
ఉన్నారు,పైగా ఆయన్ని ఉపన్యసించమంటే 
 " నేనింకాఈరోజుకీ సంగీతం నేర్చుకుంటూనే 
ఉన్నాను .నేర్చుకోవడం అనేది 
అనంతమైనది .మీరుకూడా మీ 
 కిష్టమైనవిషయం ఎంచుకోండి , 
 నిరంతరం నేర్చుకుంటూనే  ఉండండి "  
అని చెప్పిముగించారు .అదే నేనైతేనా ..
 నాలో అహం ఆలోచించింది ... 

రెండ్రోజుల క్రితం ఇస్రో సంస్థ వారు అంగారక
 గ్రహంమీదకు పంపించిన "  మంగళ్యాన్ " 
ఉపగ్రహంగూర్చి చూశాను . ఇస్రో ఛైర్మన్
 రాధాకృష్ణన్ ,ఇతర శాస్త్రవేత్తలూ ఉపగ్రహం 
గూర్చి వివరించినవిధం ,వారు చేసిన
 కృషి ,వారి విజ్ఞానం ఎంత గొప్పవి .
వారి వల్ల కదా ! భారతదేశం అమెరికా ,
రష్యా ,యూరోప్ వంటి  వాటి ప్రక్కన స్థానం
 దక్కించుకుంది .దీనికంతటికి  కారణమయిన
 వారు ఎంత సీదాసాదాగా ఉన్నారు .అదే 
నేను శాస్త్రవేత్త ఐతేనా.....నాలో
 అహం ఆలోచించింది ... 

 అతి చిన్న వయసులో క్రికెట్ బ్యాట్  పట్టి

 100సెంచరీలు చేసి ,200 టెస్ట్ మ్యాచ్ లు ,
463వన్డేమ్యాచ్ లు ఆడి భారతజట్టు 
విజయానికిఎన్నిమారులో కారణమైన
 భారతజాతి గర్వించ దగిన సచిన్ ఎంత
 ఒదిగి మాట్లాడాడు ఇంటర్యూలో .
అదే  నేనైతేనా ..నాలో అహం 
ఆలోచించింది ... 

ఇలా నా అహం ఆలోచిస్తూండగా ....
 హాయ్ ! అనివినపడింది . చూస్తే నా 
స్నేహితురాలు సుష్మ .ఆమెను
 ఆహ్వానించాను లోపలికి . ఆ కబుర్లు ,
ఈ కబుర్లు చెప్పుకుంటుంటే రాత్రి 
8 గంటలైంది , అమ్మ ఇద్దరికీ
 భోజనం వడ్డించింది . భోజనం 
అయ్యాక డాబా పై చల్లని వెన్నెల్లో 
కూర్చుని కబుర్లాడుకున్నాం .
 టైం తొమ్మిదయింది .సుష్మ వాళ్ళ
 తమ్ముడు వచ్చేసరికి లేచి నా 
దగ్గరకు వచ్చి నన్ను చూసి ..
 ఎదుటివారిలో గొప్పతనాన్ని కూడా 
చూడడానికిప్రయత్నించు ,ఇంకా 
గొప్పదానివి అవుతావు ,అంతా 
సంతోషిస్తారుఅంది . అలాగేలే అంటూ
 నవ్వి సుష్మను పంపించి లోపలికి 
వచ్చి అమ్మా!నాకు నిద్ర వస్తోంది
 అంటూ లోపలి వెళ్లాను . 

పడుకున్నానుకానీ నిద్ర పట్టడం 
లేదు. మనస్సుఅశాంతిగా ,అస్థిమితంగా 
ఉంది .అటూ ,ఇటూకదులుతూనే
 ఉన్నాను . టైం పన్నెండయింది .
 లేచి కూర్చున్నాను . నిదానంగా
ఆలోచిస్తే నాకోవిషయం తట్టింది . 
యింతటికి కారణం నాలోని " అహం  " 
ఆలోచనలు పూర్తికాకపోవడమే . 

అవును !పదే పదే  నాకు మా H.M, 
డాక్టరమ్మగారు ,ఇస్రో చైర్మన్రాధాకృష్ణన్ 
గారు ,సచిన్ అందరూ బాగా 
గుర్తుకొస్తున్నారు . వీరందరి తర్వాత 
అంటే  2-3 దశాబ్ధాల తర్వాత పుట్టి
 నేను కేవలం D.Ed చదివి టీచర్ 
అయ్యాను ,మరి వారు 2-3 దశాబ్దాల
 ముందు పుట్టి నా కంటే ఎంత గొప్ప 
స్థాయికి చేరుకున్నారు , ఎంత
సంస్కారవంతంగా ప్రవర్తిస్తున్నారు ,
ఎంత ఒదిగి ఉన్నారు . మరి 
నేనూ ..... అంతే ....
 నాలోని అహం ఆవిరైపోయింది .
మరింకెప్పుడూమేల్కోదు . 
ఎందుకంటే ఎవరి బలవంతం మీదో
 వచ్చిన జ్ఞానం కాదు ,నేను స్వయంగా 
చూసిగ్రహించిన జ్ఞానం.  కాబట్టి అది 
శాశ్వతం .ఎవడు చెప్పిన మాటో నేను
 వినడం ఏమిటి అనుకోవడం అహంకారం .
 ఎవరు చెప్పిన మంచైనా వినడం 
పరమధర్మం అని తెలుసుకున్నాను .
అంతే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టింది . 

మర్నాడు నేను నిద్ర లేచాను . నా
 అహంమాత్రం లేవలేదు .అందువల్ల నా
 ప్రవర్తనలోవచ్చిన మార్పు చూసి 
అమ్మా ,నాన్నతో సహా అందరూ 
ఆశ్చర్యపోయారు . ఎవరు కారణం
 అడిగినా చిరునవ్వు నవ్వాను . 
ఏదో ఒకటిలే మంచి మార్పు
 వచ్చింది .అది చాలు అనుకున్నారు 
అంతా . అంతే కదా !అహం 
ఆవిరైతే ఎంతో మందికి చేరువవుతాం .

 

*************

 

3 comments:

  1. A truth told in a beautiful way. Hope it will open many more eyes..

    ReplyDelete
    Replies
    1. Sir, welcome to my BLOG and thank you very much.

      Delete
  2. chinna incident tho adbuthamaina pst disign chesaaru superb pic & pst bth

    ReplyDelete